Welcome to my blog
go to my homepage
Go to homepage

Friday 11 November 2011

విశాఖపట్నంజిల్లా రచయితల సంఘం

సుసంపన్నమైన తెలుగు సాహిత్యాన్ని మరింత వ్యాప్తిచేసేందుకు ప్రతి జిల్లాలో కవులు,రచయితలు సమైక్యంగా ఏర్పాటు చేసుకునే సంఘాలే జిల్లా రచయితల సంఘాలు. ఆంద్ర దేశంలో చాలా జిల్లాలలో జిల్లా రచయితల సంఘాలు ఏర్పాటు అయ్యాయి. ఎందఱో గొప్ప కవులు రచయితలకు జన్మస్థలమైన విశాఖపట్నంలో మాత్రం ఇప్పటివరకు రచయిత సంఘాలు ఏర్పాటు కాకపోవడం శోచనీయం. ప్రక్కనున్న విజయనగరం జిల్లావారు విజయనగరం జిల్లా రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా రచయితల సంఘం ద్వారా తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ జరగాలని, మరెందరినో కవులు, రచయితలుగా రూపొందించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసే దృష్టితో ఇండియన్ హైకూ క్లబ్ అధ్యక్షులు డా.తలతోటి పృథ్వీ రాజ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఏర్పాటుచేసిందే ఈ సంఘం. త్వరలో కార్యవర్గాన్ని ఏర్పాటుచేసి కార్యక్రమాల్ని రూపొందించడం జరుగుతుంది.